నేడు మన పల్లె రైతుల నోట అనునిత్యం తారాడే మాట ‘వ్యవసాయం ఏళ్లనాటి శని’. అందుకే పచ్చదనాల పల్లె బీడు పడిపోతోంది. పుట్టెడు మట్టిలోంచి అన్నం తీసే రైతు బతుకు మట్టి కొట్టుకుపోతున్నది. ఈ తీరు చూస్తే ఏడేడు జన్మల వరకు వ్యవసాయం వైపు చూడకూడదనుకునే పరిస్థితి. తమ బిడ్డలు ఇంజనీరో, డాక్టరో కావాలని డాలర్లు, యూరోలు మూటగట్టుకోవాలని కోరుకునే తల్లిదండ్రుల కాలం. చదువులు ముగియక ముందే పరాయి దేశాల్లో శాశ్వత పౌరుడి హోదా దక్కించుకోవాలనే వెంపర్లాటలో యువతరం. ఈ ఇదీ నేటి సామాజిక చిత్రపటం.
ఇలా ఊరంతా నడుస్తున్న దారికి ఎదురు నడిచాడో 17 ఏళ్ల కుర్రాడు. పాలు గారే మోమే.. కానీ కళ్లలో ఆత్మవిశ్వాసపు వెలుగుంది. అందుకే అతను పిన్న వయస్సులోనే పంటలు పండించడమే కాకుండా.. కేరళ ప్రభుత్వం నుంచి ఇటీవల ‘కర్షక జ్యోతి’ అవార్డును కూడా అందుకున్నాడు. భావి భారత వ్యవసాయానికి వెలుగుబాట చూపే వారిలో తానొకడినని చాటాడు. కేరళ రాష్ట్రం వెనాడు జిల్లా మాతమంగళం గ్రామానికి చెందిన సూరజ్ అంబలావాయల్ వృత్తి విద్యా పాఠశాలలో 12వ తరగతి విద్యార్థి. రెండేళ్ల కిందట సుల్తాన్ బతేరీలో ప్రకృతి వ్యవసాయ విధానంపై ప్రకృతి వ్యవసాయ మార్గదర్శి సుభాష్ పాలేకర్ నిర్వహించిన సదస్సుకు హాజరయ్యాడు.
వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన సూరజ్కు అనునిత్యం రైతు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియనివి కాదు. ఈ సదస్సుకు హాజరైన తరువాత వ్యవసాయ సమస్యల చిక్కుముడి వీడినట్లు అనిపించింది. వెంటనే తమ పొలంలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాడు. అతని పొలం ప్రకృతి వ్యవసాయ ప్రయోగశాలగా మారింది. ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేకుండానే అన్ని రకాల కూరగాయలు, కంద, అరటితో పాటు మరో 50 రకాల పండ్లు, మరో 60 రకాల ఔషధ మొక్కలను సాగు చేస్తున్నాడు సూరజ్! గత సంవత్సరం క్యాబేజీ, కందలో రాష్ట్రంలోనే అత్యధిక దిగుబడులు సాధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘కర్షక జ్యోతి’ అవార్డును అందుకున్నాడు. పుట్టిన మట్టితో అనుబంధాన్ని తెంపుకొని సముద్రాలను దాటి వెళ్లి డాలర్ల పంటను కలగంటున్న వారికి తన కృషితో కనువిప్పు కలిగించాడు. పుట్టిన మట్టి కష్టాలు తీర్చాలనే కాంక్ష ఉంటే చాలు అనుకున్నది సాధించే దీక్షాదక్షతలను అందిపుచ్చుకోవచ్చని నిరూపించాడు. ప్రకృతి వ్యవసాయంతో సాధించిన విజయం ద్వారా భవిష్యత్ కర్షక లోకానికి భరోసాగా నిలిచాడు!
‘కర్షక జ్యోతి’ ఈ బాల రైతు!
Published Thu, Oct 23 2014 1:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement