ఉత్తరప్రదేశ్ లో మరో అమానుషం | Woman molested in busy market in UP's Mainpuri, beaten up with stick for resisting, suffers head injury | Sakshi
Sakshi News home page

ఉత్తరప్రదేశ్ లో మరో అమానుషం

Dec 21 2016 6:15 PM | Updated on Jul 23 2018 8:49 PM

ఉత్తర ప్రదేశ్ లో మరో అమానుషం చోటు చేసుకుంది. తమను వేధిస్తున్న వారిని ప్రశ్నించిన పాపానికి ఓ జంటపట్ల దుండగులు అమానుషంగా ప్రవర్తించారు.

లక్నో: ఉత్తరప్రదేశ్ లో మరో అమానుషం చోటు చేసుకుంది.  తమను వేధిస్తున్న వారిని ప్రశ్నించిన పాపానికి ఓ దంపతుల పట్ల దుండగులు అమానుషంగా ప్రవర్తించారు. గుండాల్లో  చెలరేగిన  ఆ దుర్మార్గులు ఆ యువ దంపతులపై దారుణంగా దాడిచేసి కొట్టారు.   ఉత్తరప్రదేశ్ లోని అగ్రా, మణిపురి జిల్లాలో ఈ ఘటన  జరిగింది. అయితే ఈ మొత్తం ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్  అయింది.  

వివరాల్లోకివెళితే..  ఓ   జంట తాము వెళ్లాల్సిన అడ్రస్ వెతుక్కుంటున్న క్రమంలో  స్థానికులు కొందర్ని  సంప్రదించారు. ఇంతలో  రద్దీగా మార్కెట్లో ఓ దుండగుడు వచ్చి ఆమె  పట్ల అనుచితంగా  ప్రవర్తించాడు. ఆమె చున్నీని లాగి, అమానవీయంగా ప్రవర్తించాడు. దీన్ని  గమనించి ఆమె భర్త వారించాడు. అంతే  మరో ఇద్దరు  దుండగులు సహా చెలరేగి  పోయారు. కర్రతో దాడికి దిగారు. ఈ ఘటనలో యువతి తలకు తీవ్ర గాయాలయ్యాయి.   వీరికి ఒక పాప కూడా ఉన్నట్టు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.
బాధితుల  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరిలో ఒకరిని ఆనంద్  యాదవ్ గా గుర్తించారు.  మరోవైపు నిందితులను అరెస్ట్ చేయకపోతే  తనను తాను కాల్చుకు చనిపోతానని  బెదిరించినట్టుతెలుస్తోంది.


 

Advertisement
 
Advertisement
Advertisement