శశిథరూర్‌కు సునంద సోదరుడు మద్దతు | Sakshi
Sakshi News home page

శశిథరూర్‌కు సునంద సోదరుడు మద్దతు

Published Sat, Jan 25 2014 9:53 PM

శశిథరూర్‌కు సునంద సోదరుడు మద్దతు

న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో కేంద్ర మంత్రి శశిథరూర్‌కు ఆమె కుటుంబం నుంచి గట్టి మద్దతు లభించింది. థరూర్ సునందకు హాని చేస్తారని ఊహించలేమని పుష్కర్ సోదరుడు రాజేశ్ పేర్కొన్నారు. ఈయన భారత సైన్యంలో కల్నల్‌గా పనిచేస్తున్నారు. తమ కుటుంబాన్ని వ్యథకు గురిచేస్తున్న వదంతులకు ఇకనైనా ముగింపు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సునంద ఎంతో దృఢమైన వ్యక్తిత్వమున్న మనిషని, ఆమె తనను తాను గాయపరుచుకుంటార ని అనుకోవడం కూడా అసంబద్ధం, నమ్మలేని విషయమని చెప్పారు. వారి దాంపత్య జీవితం యూవత్తూ తాను వెన్నంటి ఉన్నానని, వారు పరస్పరం పిచ్చి ప్రేమలో ఉన్నట్టు తాను చెప్పగలనని కల్నల్ రాజేశ్ పేర్కొన్నారు.

 

విభేదాలేమైనా ఉంటే క్షణికమేనని, ప్రతి కుటుంబంలో అవి సాధారణమేనని చెప్పారు. వదంతులకు తెరదించేందుకు కేసును వేగంగా దర్యాప్తు చేయూలని ఆయన కోరారు. అంతకుముందు సునంద కుమారుడు శివ్‌మీనన్ కూడా తన తల్లి మృతి వెనుక కుట్ర ఉందనడాన్ని తాను విశ్వసించబోనంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.
 

Advertisement
Advertisement