'థరూర్ ను మరోసారి ప్రశ్నిస్తాం' | Tharoor may be questioned again, says police | Sakshi
Sakshi News home page

'థరూర్ ను మరోసారి ప్రశ్నిస్తాం'

Jan 20 2015 1:48 PM | Updated on Sep 18 2019 3:04 PM

'థరూర్ ను మరోసారి ప్రశ్నిస్తాం' - Sakshi

'థరూర్ ను మరోసారి ప్రశ్నిస్తాం'

సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ను మరోసారి ప్రశ్నించే అవకాశముందని ఢిల్లీ పోలీస్ చీఫ్ బీఎస్ బాసీ తెలిపారు.

న్యూఢిల్లీ: సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ను మరోసారి ప్రశ్నించే అవకాశముందని ఢిల్లీ పోలీస్ చీఫ్ బీఎస్ బాసీ తెలిపారు. అవసరమైతే మరోసారి ఆయన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పలువురి విచారించామని, ఇంకా కొందరిని ప్రశ్నిస్తున్నామని అన్నారు.

సోమవారం రాత్రి థరూర్ ను మూడున్నర గంటల పాటు ప్రశ్నించామని, అవసరమైతే రెండవసారి పశ్నించేందుకు ఆయనను పిలుస్తామని వెల్లడించారు. థరూర్ ఏం సమాధానం చెప్పారనేది వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement