ఆగని అత్యాచారాలు : సిఐ, ఆరుగురు పోలీసుల సస్పెన్షన్ | Rapes in UP | Sakshi
Sakshi News home page

ఆగని అత్యాచారాలు: సిఐ,ఆరుగురు పోలీసుల సస్పెన్షన్

Jun 7 2014 7:40 PM | Updated on Aug 25 2018 4:14 PM

ఆగని అత్యాచారాలు : సిఐ, ఆరుగురు పోలీసుల సస్పెన్షన్ - Sakshi

ఆగని అత్యాచారాలు : సిఐ, ఆరుగురు పోలీసుల సస్పెన్షన్

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

 ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బదౌన్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం జరిపి చెట్టుకు ఉరివేసిన ఘటన  ఘటనను మరువక ముందే మరో సామూహిక అత్యాచార సంఘటన వెలుగుచూసింది. ముజఫర్‌నగర్ జిల్లా దుల్హేరా గ్రామంలో ఓ మహిళపై ఐదుగురు మగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు షాపూర్ నుంచి దుల్హేరా గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

 ఐదుగురు దుండగులు ఆమెను దగ్గరలోని శ్మశానానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. జూన్ 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే దీనిపై పోలీసులు స్పందించకపోవడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో గ్రామస్తులు దుల్హేరా పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి నిరసన తెలిపారు. గ్రామస్తుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐతో పాటు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బుదానా సర్కిల్ ఆఫీసర్ శైలేంద్ర లాల్‌తో పాటు ఆరుగురిని సస్పెండ్ చేసినట్టు సీనియర్ ఎస్‌పీ హెచ్‌ఎన్ సింగ్ శనివారం తెలిపారు. ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement