ఈవైపై ఎన్‌ఎస్‌ఈఎల్ ఇన్వెస్టర్ల ఫిర్యాదు | NSEL investors file complaint against EY India | Sakshi
Sakshi News home page

ఈవైపై ఎన్‌ఎస్‌ఈఎల్ ఇన్వెస్టర్ల ఫిర్యాదు

Oct 29 2013 1:06 AM | Updated on Sep 2 2017 12:04 AM

చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈఎల్) వివాదంలో తాజాగా ఆడిటింగ్ సంస్థ ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ ఇండియా (ఈవై) ఇరుక్కుంది.

ముంబై: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈఎల్) వివాదంలో తాజాగా ఆడిటింగ్ సంస్థ ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ ఇండియా (ఈవై) ఇరుక్కుంది. ఈ కుంభకోణంలో ఈవై పాత్ర కూడా ఉందంటూ ఎన్‌ఎస్‌ఈఎల్ స్కాములో మోసపోయిన ఇన్వెస్టర్ల ఫోరం .. ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ)కి ఫిర్యాదు చేసింది. అయితే, ఈవై తమపై ఆరోపణలను ఖండించింది. దేశీయంగా కమోడిటీ ఫైనాన్సింగ్‌పై తాము ఇచ్చిన నివేదికలో తప్పులేమీ లేవని స్పష్టం చేసింది. ఎస్‌వీ ఘటాలియా అండ్ అసోసియేట్స్ చేసిన ఎన్‌ఎస్‌ఈఎల్ ఆడిటింగ్‌కి తమ నివేదికకు ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement