సరదా కోసం వెళ్తే.. లక్షన్నర దోచేశారు! | MP's son robbed of Rs 1.50 lakh by callgirl, driver | Sakshi
Sakshi News home page

సరదా కోసం వెళ్తే.. లక్షన్నర దోచేశారు!

Aug 18 2015 7:00 PM | Updated on Sep 19 2019 8:40 PM

సరదా కోసం వెళ్తే.. లక్షన్నర దోచేశారు! - Sakshi

సరదా కోసం వెళ్తే.. లక్షన్నర దోచేశారు!

అతడో డబ్బున్న కుర్ర మారాజు. ఉత్తరప్రదేశ్లోని ఓ ఎంపీ గారి కుమారుడు. సుఖం కొనుక్కుందామని.. ఓ కాల్గర్ల్ను మాట్లాడుకున్నాడు. కానీ.. సదరు కాల్ గర్ల్, ఆమె డ్రైవర్ కలిసి అతగాడి దగ్గర ఏకంగా లక్షన్నర రూపాయలు దోచేశారు.

అతడో డబ్బున్న కుర్ర మారాజు. ఉత్తరప్రదేశ్లోని ఓ ఎంపీ గారి కుమారుడు. సుఖం కొనుక్కుందామని.. ఓ కాల్గర్ల్ను మాట్లాడుకున్నాడు. కానీ.. సదరు కాల్ గర్ల్, ఆమె డ్రైవర్ కలిసి అతగాడి దగ్గర ఏకంగా లక్షన్నర రూపాయలు దోచేశారు. ఈ ఘటన ముంబై శివార్లలోని శాంతాక్రజ్ ప్రాంతంలో జరిగింది.

తనకు జరిగిన అన్యాయంపై సదరు ఎంపీ కుమారుడు వకోలా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఒక ఏజెంటు ద్వారా తాను ఆ కాల్గర్ల్ను మాట్లాడుకున్నానని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ ఎం వవ్హాలే తెలిపారు. కాల్ గర్ల్ తన డ్రైవర్తో కలిసి వచ్చిందని, రాగానే.. ఆ డ్రైవర్ కత్తి చూపించి తనను బెదిరించి తన దగ్గర ఉన్న రూ. 1.50 లక్షల నగదు దోచుకెళ్లిపోయారని, ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement