బాలికపై అత్యాచారం.. హత్య | Minor boys Raped and murdered Girl in karnataka | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం.. హత్య

Jun 16 2014 9:12 PM | Updated on Jul 28 2018 8:51 PM

ఓ బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం చేసి.. హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలోని లింగసూగూరు తాలూకాలో ఆదివారం రాత్రి జరిగింది.

లింగసూగూరు(కర్ణాటక): ఓ బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం చేసి.. హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలోని లింగసూగూరు తాలూకాలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. తాలూకాలోని గొనవాట్ల తండాకు చెందిన కవిత(8) గొర్రెలను మేపడానికి ఆదివారం ఉదయం వెళ్లింది. సాయంత్రం ఆ గొర్రెలు మాత్రమే ఇంటికి తిరిగొచ్చాయి. కవిత రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల పొలాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది.

ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలురపై(14),(15) అనుమానం రావడంతో సోమవారం ఉదయం వారిని నిలదీశారు. కవితపై అత్యాచారం చేసి.. రాళ్లతో కొట్టి చంపి.. మృతదేహాన్ని ముళ్లకంపల్లో పారేసినట్లు ఆ బాలురు ఒప్పుకున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు వెళ్లి.. ముళ్లకంపల్లో పడివున్న బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ తండా వాసులు చితకబాది పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement