అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ | Maoists, police exchange fire in Kerala forest | Sakshi
Sakshi News home page

అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్

Oct 17 2015 3:48 PM | Updated on Oct 9 2018 2:51 PM

అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ - Sakshi

అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్

కేరళ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య శనివారం హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి.

పాలక్కడ్ : కేరళ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య శనివారం హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి రమేశ్ చన్నీతాల వెల్లడించారు. అట్టపడ్డి అటవీ ప్రాంతంలో గస్తీ పోలీసులకు ఐదుగురు మావోయిస్టులు తారసపడ్డారు. ఆ క్రమంలో  పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారని చెప్పారు. వెంటనే స్పందించిన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారని... దీంతో ఇరువైపులా హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. 

అయితే ఈ కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందిన విషయాన్ని మాత్రం వెల్లడించేందుకు మంత్రి రమేశ్ నిరాకరించారు. ఈ కాల్పుల్లో పోలీసులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పాలక్కడ్ జిల్లా కలెక్టర్ మేరీ కుట్టి స్పష్టం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో పోస్టర్లు, ప్రచార సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అటవీ ప్రాంతంలో భారీగా బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement