వేలంలో మహాత్ముని చరఖాకు రూ.1 కోటి | Mahatma Gandhi's charkha sold for Rs. 1 crore | Sakshi
Sakshi News home page

వేలంలో మహాత్ముని చరఖాకు రూ.1 కోటి

Nov 6 2013 3:23 AM | Updated on Sep 2 2017 12:18 AM

వేలంలో మహాత్ముని చరఖాకు రూ.1 కోటి

వేలంలో మహాత్ముని చరఖాకు రూ.1 కోటి

క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా ఒకటి మంగళవారం లండన్‌లో నిర్వహించిన వేలంపాటలో రూ.1 కోటి ధర పలికింది

లండన్:  క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా ఒకటి మంగళవారం లండన్‌లో నిర్వహించిన వేలంపాటలో రూ.1 కోటి ధర పలికింది. ఎనిమిది దశాబ్దాల క్రితం ఉద్యమకాలంలో పుణెలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో గాంధీ ఈ చరఖాను ఉపయోగించారని ముల్లక్ వేలం సంస్థ అధికారి మైఖేల్ మోరిస్ తెలిపారు. భారత్‌లో విద్య, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేసిన అమెరికాకు చెందిన మెషినరీ రెవడెండ్ ఫ్లోయిడ్ ఏ పఫర్‌కు 1935లో గాంధీ ఈ చరఖాను బహుమతిగా ఇచ్చారు. అనంతరకాలంలో ఈ చరఖా చాలామంది చేతులు మారింది. గాంధీ చివరి విల్లు సైతం మంగళవారం జరిగిన వేలంపాటలో దాదాపు రూ.20,00,000 మొత్తానికి అమ్ముడుపోయింది. వీటిని వేలంలో సొంతంచేసుకున్న వారి వివరాలను సంస్థ వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement