సునంద, శశి థరూర్ మధ్య త(క)రార్ | I'm victim of conspiracy: Pakistan journalist Mehr Tarar on Twitter row with Tharoors | Sakshi
Sakshi News home page

సునంద, శశి థరూర్ మధ్య త(క)రార్

Jan 20 2014 4:11 AM | Updated on Sep 2 2017 2:47 AM

సునంద, శశి థరూర్ మధ్య త(క)రార్

సునంద, శశి థరూర్ మధ్య త(క)రార్

సునంద పుష్కర్ మృతి నేపథ్యంలో వార్తల్లో వ్యక్తిగా మారి న పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్..

ఇస్లామాబాద్: సునంద పుష్కర్ మృతి నేపథ్యంలో వార్తల్లో వ్యక్తిగా మారి న పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్.. తనకు, శశి థరూర్ దంపతుల మధ్య విభేదాలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. వారిద్దరి మధ్య విభేదాలున్నట్లు ఏప్రిల్ నుంచే పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. ఈ కుట్రలో తనను పావును చేశారని ఆరోపించారు. శనివారం రాత్రి ఓ టీవీ విలేకరితో ఆమె మాట్లాడుతూ.. ‘నేను థరూర్‌ను కలిసింది రెండేసార్లు.. ఒకటి ఏప్రిల్ నెలలో భారత్‌లో, మరోసారి గతేడాది జూన్‌లో దుబాయ్‌లో ఉండగా. ఆ సమయంలో అక్కడ ఈయనే కాదు చాలా మంది ఉన్నారు. అయితే తర్వాత థరూర్ గురించి నేను ఓ ఆర్టికల్ రాశాను.
 
  ఇందులో ఆయన్ను ప్రశంసించడం ఆయన భార్యకు నచ్చలేదనుకుంటా. దీంతో నాతో మాట్లాడొద్దని సునం ద.. శశిని హెచ్చరించారు. ఆయనతో నా సంభాషణ కూడా సాధారణ అంశాలపైనే సాగేది.. అవి నేను అందరితో మాట్లాడేవే’’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement