కలాంకు పలువురు నేతల నివాళి
న్యూఢిల్లీ: 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ప్రజలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాలు ఎగరేసి, దేశభక్తి గీతాలు ఆలపించి స్వాతంత్య్ర సమరయోధుల సేవలను గుర్తు చేసుకున్నారు. పలు రాష్ట్రాల రాజధానుల్లో ముఖ్యమంత్రులు జాతీయజెండాలను ఆవిష్కరించి, తమ రాష్ట్రాలను అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పారు. ఉగ్రవాద దాడులను అరికట్టేందుకు భద్రతా సిబ్బంది గట్టి చర్యలు తీసుకోవడంతో వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.
మావోయిస్టులు ఇచ్చిన బహిష్కరణ పిలుపును ప్రజలు లెక్కచేయకుండా వేడుకల్లో పాల్గొన్నారు. పాక్ వ్యవస్థాపకుడు జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతాన్ని తమ రాష్ట్రం తిరస్కరించిందని జమ్మూ కశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అన్నారు. కేంద్రం బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం నితీశ్కుమార్ డిమాండ్ చేశారు.
ఇస్రో మహిళా శాస్త్రవేత్తకు కలాం అవార్డు
ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు కూడా పలువురు నేతలు పంద్రాగస్టు సందర్భంగా నివాళి అర్పించారు. కలాం పేరుతో తమినాడు ఏర్పాటు చేసిన అవార్డును తొలిసారి ఇస్రోకు చెందిన మహిళా శాస్త్రవేత్త ఎన్.వలర్మతికి సీఎం జయలలిత అందజేశారు. అవార్డు కింద స్వర్ణపతకం, రూ.5 లక్షలు ప్రదానం చేశారు.బిహార్కు కలాం చేసిన సేవలను ప్రతిబింబించే శకటాన్ని పట్నాలో జరిగిన పరేడ్లో ప్రదర్శించారు. దేశ న్యాయవ్యవస్థకు ఉన్న స్వతంత్రతను కాపాడుకోవడానికి జడ్జీలు, న్యాయవాదులు ఏకతాటిపైకి రావాలని భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్. దత్తు
ప్రపంచవ్యాప్తంగా మువ్వన్నెల రెపరెపలు
వాషింగ్టన్: స్వాతంత్య్ర వేడుకలు అమెరికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని భారత ఎంబసీల్లోనూ ఘనంగా జరిపారు. వందలాది భారతీయులు, వారి స్నేహితులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ఎంబసీలో హైకమిషనర్ టీసీఏ రాఘవన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అమెరికాలో 38వేల మందితో పరేడ్
పంద్రాగస్టు సందర్భంగా అమెరికాలోని ఎడిసన్ నగరంలో 38వేల మందితో నిర్వహించిన భారీ పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. రెండు కిలోమీటర్ల పొడవున సాగిన పరేడ్లో డజన్ల కొద్దీ బృందాలు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా, 20 శకటాలను ప్రదర్శించారని ఇండియా వెస్ట్ పత్రిక ఓ కథనంలో తెలిపింది. ఎడిసన్లో ప్రారంభమైన ఈ పరేడ్ ఉడ్బ్రిడ్జ్ పట్టణం సమీపంలోని ఇండియా స్క్వేర్ వద్ద ముగిసింది. న్యూజెర్సీలోని 100కుపైగా సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఎడిసన్, ఉడ్బ్రిడ్జ్ మేయర్లతోపాటు పలువురు భారత ప్రముఖులు ఇందులో పాలుపంచుకున్నారు.
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
Published Sun, Aug 16 2015 2:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement