19 ఏళ్ల యువతిపై దాడి: మృతి | Girl stabbed to death in Delhi | Sakshi
Sakshi News home page

19 ఏళ్ల యువతిపై దాడి: మృతి

Jul 17 2015 4:49 PM | Updated on Sep 28 2018 3:41 PM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతిపై ఇద్దరు దుండగులు దాడి చేసి ఆమె మృతికి కారణమైన ఘటన తాజాగా వెలుగు చూసింది.

న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతిపై ఇద్దరు దుండగులు దాడి చేసి ఆమె మృతికి కారణమైన ఘటన తాజాగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..  తన తల్లితో కలిసి మీనాక్షి అనే యువతి గురువారం ఆనంద్ ప్రబాత్ ప్రాంతంలో మార్కెట్ కు వెళ్లింది. ఆ సమయంలో  ఆమెపై ఇద్దరు ఆగంతకులు అతి పాశవికంగా దాడికి పాల్పడ్డారు. 

 

ఈ ఘటనలో కూతురిపై దాడిని అడ్డుకునేందుకు యత్నించిన తల్లి కూడా  గాయపడింది. అయితే తీవ్రంగా గాయపడిన వీరిని రామ్ లోహియా ఆస్పత్రిలో చేర్పించగా..    మీనాక్షి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీస్ అధికారి తెలిపారు.  ఈ దాడికి కారణమైన ఇద్దరినీ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement