మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ జియోనీ రాష్ట్ర మార్కెట్లోకి ఈలైఫ్ ఈ7 మోడల్ను విడుదల చేసింది. మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ టెక్నోవిజన్ శనివారమిక్కడ లాంఛనంగా ఈ మోడల్ను ఆవిష్కరించింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ జియోనీ రాష్ట్ర మార్కెట్లోకి ఈలైఫ్ ఈ7 మోడల్ను విడుదల చేసింది. మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ టెక్నోవిజన్ శనివారమిక్కడ లాంఛనంగా ఈ మోడల్ను ఆవిష్కరించింది. 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1920్ఠ1080 రిసొల్యూషన్, ఆన్డ్రాయిడ్ 4.2, క్వాల్కామ్ 2.2 గిగాహెర్ట్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 16 ఎంపీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ధర రూ.29,999. ఇక 16 జీబీ మోడల్ ధర రూ.26,999. భారత్లో జియోనీ ఫోన్ల పంపిణీదారుగా యునెటైడ్ టెలికామ్స్ వ్యవహరిస్తోంది.
నెలకు 10-15 వేల ఫోన్లు..
రాష్ట్రంలో నెలకు 10-15 వేల జియోనీ ఫోన్లను విక్రయిస్తున్నామని యునెటైడ్ టెలికామ్స్ జీఎం సయ్యద్ అమ్జద్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ప్రస్తుతం 14 మోడళ్లు రూ.2-30 వేల ధరలో ఉన్నాయి. ఈ ఫోన్లకు ఆదరణ ఉందని, డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేయలేకపోతున్నామని టెక్నోవిజన్ ఎండీ సికందర్ పేర్కొన్నారు.