4. 8 తీవ్రతతో నేపాల్లో కంపించిన భూమి | earthquake jolt Nepal | Sakshi
Sakshi News home page

4. 8 తీవ్రతతో నేపాల్లో కంపించిన భూమి

Aug 16 2015 1:06 PM | Updated on Sep 3 2017 7:33 AM

నేపాల్లో ఆదివారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది.

ఖాట్మాండ్: నేపాల్లో ఆదివారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.8గా నమోదు అయింది. రాజధాని ఖాట్మాండ్కు 110 కిలోమీటర్ల దూరంలో దోల్క జిల్లాలో భూకంప కేంద్రం కనుగొన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

అయితే ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం కానీ సంభవించలేదని తెలిపారు.  అయితే నిన్న నేపాల్లో రెండు సార్లు భూమి స్వల్పంగా కంపించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్లో నేపాల్లో భూకంపం వల్ల 9 వేల మంది మరణించిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement