breaking news
Dolakha district
-
నేపాల్లో భూకంపం
ఖాట్మాండు: మన పొరుగు దేశం నేపాల్లో మంగళవారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. భూకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదయినట్టు నేపాల్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. మంగళవారం రాత్రి 11.53 గంటల సమయంలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. డొలాకా జిల్లాలోని జుగు ప్రాంతంలో భూకంపన కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావంతో ఖాట్మాండు, కాస్కీ, పర్సా, సింధుపల్చోక్ తదితరా ప్రాంతాల్లో భూకంపనాలు సంభవించాయని ‘హిమాలయన్ టైమ్స్’ పేర్కొంది. అయితే భూకంపం ధాటికి ఎవరు గాయపడినట్టు, చనిపోయినట్టు, ఆస్తి నష్టం సంభవించినట్టు వెంటనే సమాచారం లేదు. నేపాల్ సరిహద్దులోని భారత్ ప్రాంతంలోనూ భూకంపనాలు సంభవించలేదని సమాచారం. (అసత్య ప్రచారంపై ప్రపంచాస్త్రం) -
4. 8 తీవ్రతతో నేపాల్లో కంపించిన భూమి
ఖాట్మాండ్: నేపాల్లో ఆదివారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.8గా నమోదు అయింది. రాజధాని ఖాట్మాండ్కు 110 కిలోమీటర్ల దూరంలో దోల్క జిల్లాలో భూకంప కేంద్రం కనుగొన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ఎక్కడ ఆస్తి, ప్రాణ నష్టం కానీ సంభవించలేదని తెలిపారు. అయితే నిన్న నేపాల్లో రెండు సార్లు భూమి స్వల్పంగా కంపించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్లో నేపాల్లో భూకంపం వల్ల 9 వేల మంది మరణించిన విషయం విదితమే.