ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం దోన బండ గ్రామానికి చెందిన యువ రైతు ఈర్ల కృష్ణ(28) అప్పుల బాధ భరించలేక బలవన్మరణం చెందాడు.
రఘునాథపాలెం (ఖమ్మం) : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం దోన బండ గ్రామానికి చెందిన యువ రైతు ఈర్ల కృష్ణ(28) అప్పుల బాధ భరించలేక బలవన్మరణం చెందాడు. వ్యవసాయం కలిసిరాకపోవడంతో రూ.3 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగిన కృష్ణను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ మృతుని కుంటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.