తమ గ్రామంలో సెల్టవర్ ఏర్పాటు చేయవద్దంటూ శుక్రవారం మధ్యాహ్నం గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ముథోల్(ఆదిలాబాద్): తమ గ్రామంలో సెల్టవర్ ఏర్పాటు చేయవద్దంటూ శుక్రవారం మధ్యాహ్నం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలకేంద్రంలోని బస్టాప్ వద్ద ఓ సెల్ కంపెనీ ఆధ్వర్యంలో టవర్ ఏర్పాటు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. టవర్ కారణంగా తమ ఆరోగ్యం దెబ్బతింటుందంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు స్తంభించాయి.