అంతిమ ‘సంస్కారాన్ని’ మరిచిన కొడుకు | ultimate 'Katniss' son defaulters | Sakshi
Sakshi News home page

అంతిమ ‘సంస్కారాన్ని’ మరిచిన కొడుకు

Feb 18 2015 1:45 AM | Updated on Sep 2 2017 9:29 PM

కన్నతండ్రి అంత్యక్రియలు చేయడం భారంగా భావించాడో కొడుకు. కనీసం కడసారి చూపునకు కూడా రాకుండా..కర్కశంగా వ్యవహరించాడు.

మృతుడు బలపాలవాసి ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఘటన
దహన సంస్కారాలు నిర్వహించిన కూతుళ్లు
 

కారేపల్లి : కన్నతండ్రి అంత్యక్రియలు చేయడం భారంగా భావించాడో కొడుకు. కనీసం కడసారి చూపునకు కూడా రాకుండా..కర్కశంగా వ్యవహరించాడు. అరుుతే కూతురు మాత్రం అన్నీతానై తండ్రికి తలకొరివి పెట్టింది. ఈ ఘటన కారేపల్లి మండలంలోని మొట్లగూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా బలపాల గ్రామానికి చెందిన రాయల పిచ్చయ్య(75)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా నెల రోజుల క్రితం బలపాలలో తన ఇంట్లో  జరిగిన గ్యాస్ లీకేజీ  ప్రమాదంలో తన చిన్న కుమారుడు రాయల శ్రీనివాసరావు మృతిచెందగా, రాయల పిచ్చయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో పెద్దకుమారుడు తండ్రిని పట్టించుకోకుండా వదిలేశాడు. కారేపల్లి మండలం మాణిక్యారం గ్రామపంచాయతీ మొట్లగూడేనికి చెందిన తన చిన్నకుమార్తె గుర్రం మంగమ్మ తండ్రిని, పెద్ద కుమార్తె రాయల వెంకటనర్సమ్మను ఇంటికి తీసుకొచ్చి బాగోగులు చూసుకుంటోంది. ఈ క్రమంలో పిచ్చ య్య మృతిచెందడంతో పెద్ద కుమారుడికి కబురు చేశారు. అతడు తండ్రిని చివరి చూపు చూడడానికి సైతం రాలేదు. దీంతో అవివాహితురాలైన రాయల వెంకటనర్సమ్మ తండ్రికి తలకొరివి పెట్టిం ది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement