తెలంగాణలో 41కి చేరిన కరోనా కేసులు

Two More Corona Cases Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 41 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌కు చెందిన 43 ఏళ్ల మహిళతో పాటు సౌదీ అరేబియా నుంచి వచ్చిన మూడేళ్ల బాలుడికి కరోనా సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక దేశ వ్యాప్తంగా 606 కరోనా కేసులు నమోదు కాగా 11 మరణాలు చోటుచేసుకున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top