పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుండగా.. | Three serious injuries in the opponents attack | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుండగా..

Nov 7 2015 12:05 PM | Updated on Oct 8 2018 5:04 PM

భూ వివాదం.. దాయాదుల మధ్య చిచ్చుపెట్టింది.

భూ వివాదం.. దాయాదుల మధ్య చిచ్చుపెట్టింది. ఇరు వర్గాల వారు ఒకరిపై మరొకరు ఘర్షణకు దిగారు. ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక వర్గం వారిని మరో వర్గం వారు మార్గ మధ్యలో పట్టుకొని చితకబాదారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో.. ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

 గ్రామనికి చెందిన మహబూబ్‌సాబ్‌కు రహీంబాబాకు మధ్య భూమికి సంబంధించిన విషయంలో తరచూ తగాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శుక్రవారం కూడా వీరి మధ్య వివాదం తలెత్తడంతో.. దాని పై ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న మహబూబ్‌సాబ్(55), హసీమొద్దీన్(32), హాజుద్దీన్(25)లపై రహీంబాబా అనుచరులతో కలిసి వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement