పరిధి పెంపుపై ప్రభుత్వం దృష్టి
రెట్టింపు కానున్న ఉద్యోగుల సంఖ్య
సీఎం చెంతకు చేరిన ప్రతిపాదనలు
హన్మకొండ: తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ‘కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ (కుడా) జవసత్వాలు కూడగట్టుకోనుంది. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న కుడాకు కష్టాలు తీరనున్నాయి. వరంగల్ నగరం, పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 1805 చదరపు కిలోమీటర్ల పరిధితో 1982లో ‘కుడా’ను ఏర్పాటు చేశా రు. కుడా పరిధిలోకి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 171 గ్రామా లు ఉన్నాయి. ఇందులో 27 గ్రామాలు కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నాయి. చైర్మన్, వైస్ చైర్మలతో పాటు మొత్తం పరిపాలన, ప్లానింగ్, అభివృద్ధి, అర్బన్ ఫారెస్ట్, భూసేకరణ, అకౌంట్స్ మొత్తం ఆరు విభాగాలతో కుడాను ఏర్పాటు చేశారు. మొత్తం 168 పోస్టులు మంజూరు చేశారు.
అయితే గడిచిన ముప్పై ఏళ్లుగా ఉద్యోగులను భర్తీ చేయలేదు. కేవలం 46 మంది ఉద్యోగస్తులతో నెట్టుకొస్తోంది. దీంతో అభివృద్ధి పనుల్లో వేగం మందగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరంగల్.. రాష్ట్రంలో రెండో ప్రధాన నగరం హోదాలో ఉంది. నగర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉంది. మరోవైపు కుడా పరిధిలో జనాభా 7.6 లక్షల నుంచి 13 లక్షలకు చేరుకుంది. ఇటీవల నగర అభివృద్ధిపై సమీక్ష సందర్భంగా కుడాను బలోపేతం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఖాళీలన్నీ భర్తీ..
కేంద్ర ప్రభుత్వ పథకాలైన హృదయ్, అమృత్, స్మార్ట్ సిటీలలో వరంగల్కు చోటు దక్కింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను వరంగల్లో నెలకొల్పబోతోంది. అంతేకాకుండా నగరంలో మురికివాడల్లో నివసిస్తున్న పేదల కోసం 30వేల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించనున్నారు. అంతేకాకుండా కుడా పరిధిని 1805 చదరపు కిలోమీటర్ల నుంచి 2300 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించాలని ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. దీంతో కుడాపై పని భారం అనూహ్యంగా పెరిగిపోనుంది. వీటన్నింటీని దృష్టిలో ఉంచుకుని గతంలో మంజూరై ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేయాలని సీఎం కే సీఆర్ నిర్ణయించారు. పెరిగిన జనాభా, అభివృద్ధి కార్యక్రమాలు, మాస్టర్ప్లాన్ ఆధారంగా అవసరమైన మేరకు కొత్త పోస్టులు సృష్టించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర మున్సిపల్ శాఖ సిద్ధం చేస్తోంది. ఈమేరకు త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
కుడా ఇక.. బడా
Published Thu, Feb 4 2016 1:39 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement