హైదరాబాద్లో మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు జరపతలపెట్టిన సీపీఐ(ఎం) రాష్ట్ర తొలి మహాసభల సందర్భంగా నిజాం కాలేజ్ గ్రౌండ్లో ప్రత్యామ్నాయ ప్రజాసంస్కృతి ప్రతిబింబించే విధంగా...
సాక్షి, హైదరాబాద్; హైదరాబాద్లో మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు జరపతలపెట్టిన సీపీఐ(ఎం) రాష్ట్ర తొలి మహాసభల సందర్భంగా నిజాం కాలేజ్ గ్రౌండ్లో ప్రత్యామ్నాయ ప్రజాసంస్కృతి ప్రతిబింబించే విధంగా తెలంగాణ జన జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమానికి సంబంధించిన కళారూపాలను ప్రదర్శించటానికి ఆరు ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.