ఏపీ ఉన్నత విద్యా మండలిలో పనిచేసే తెలంగాణ ఉద్యోగులకు సంకటం
నేటి నుంచి తమ వద్దే పనిచేయాలంటూ టీ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు
విభజన కాకుండా వెళ్తే న్యాయపరమైన చిక్కులు తప్పవంటున్న ఏపీ మండలి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ వివాదం ఏపీ ఉన్నత విద్యామండలిలో కూడా గందరగోళాన్ని రేపింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటు కావడంతో దానికి ఏపీ ఉన్నత విద్యామండలి తన భవనంలోని పై అంతస్తును కేటాయించింది. చైర్మన్కు, ఇతర ముఖ్యులకు వాహనాలు సమకూర్చింది. ఆ మండలికి తాత్కాలికంగా కొంతమంది ఉద్యోగులను కూడా సర్దుబాటు చేసింది. విభజన వ్యవహారం తేలేవరకు ఉద్యోగులు రెండు చోట్లా పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా ఏపీ ఉన్నత విద్యామండలిలో ఉన్న తెలంగాణ ఉద్యోగులు మంగళవారం నుంచి తమ వద్ద మాత్రమే పనిచేయాలంటూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఏపీ మండలిలో ఉన్న తెలంగాణ ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. తమ ఆదేశాల ప్రకారం రాకపోతే వేరేగా ఉద్యోగులను నియమించుకుని, వారినే శాశ్వత ఉద్యోగులుగా కొనసాగిస్తామని టీ మండలి చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉద్యోగులు తెలంగాణ ఉన్నత విద్యామండలికి వెళ్లాలంటే ముందుగా ఏపీ ఉన్నత విద్యామండలి అధికారికంగా విభజన అవ్వాలని, అది కాకుండా వె ళ్తే ఇబ్బందుల పాలవుతారని ఏపీ మండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ‘‘ఉన్నత విద్యా మండలిని కేంద్ర ప్రభుత్వం పదో షెడ్యూల్ నుంచి తొలగించాక నోడల్ అధికారిని నియమించి ఉద్యోగులు, ఆస్తులు అప్పుల పంపకాలు చేయాలి.
అప్పటివరకు అధికారిక విభజన కానట్టే’’ అని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీ ఉన్నత విద్యామండలిలో ప్రస్తుతం 36 మంది ఉద్యోగుల్లో 14 మంది శాశ్వత ఉద్యోగులు... మిగతావారు ఒప్పంద ఉద్యోగులు. వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 10 మందికి మించి లేరు. సోమవారం తెలంగాణ ఉద్యోగులు ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి కృష్ణమూర్తిని కలసి తెలంగాణ విద్యామండ లికి తమను కేటాయించాలని కోరారు. అనధికారికంగా ఎవరు ఎక్కడ పనిచేసినా అభ్యంతరం లేదని, అయితే అధికారిక బదిలీకి నిబంధనలు అంగీకరించవని ఆయన స్పష్టం చేశారు.
మండలిలో ‘ఎంసెట్’ చిచ్చు!
Published Tue, Jan 6 2015 1:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement