త్యాగం, సహనమే బక్రీద్‌ స్ఫూర్తి: కేసీఆర్‌ 

Telangana CM KCR Bakrid Wishes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈద్‌–ఉల్‌–జుహ (బక్రీద్‌) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్‌ పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దైవ ప్రవక్త బోధనలను అనుసరించాలని ఈ పండుగ గుర్తుచేస్తోందన్నారు. తోటి మనుషుల పట్ల కరుణ, త్యాగం, సహనంతో వ్యవహరించడానికి ఈ పండుగ స్ఫూర్తి కలిగిస్తోందని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top