ప్రశాంతంగా ‘టెట్’ | teacher eligibility test | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ‘టెట్’

Mar 17 2014 12:51 AM | Updated on Aug 17 2018 2:53 PM

ప్రశాంతంగా ‘టెట్’ - Sakshi

ప్రశాంతంగా ‘టెట్’

జిల్లా కేంద్రం లో ఆదివారం నిర్వహించిన టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్) ప్రశాంతంగా ముగిసింది.

 ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రం లో ఆదివారం నిర్వహించిన టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్) ప్రశాంతంగా ముగిసింది. 38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 1,807 మంది హాజరుకావాల్సి ఉండగా 1661 మంది వచ్చారు.
 
  అలాగే.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించిన పేపర్-2 పరీక్షకు 6,384 మందికి గాను 5,668 మంది పరీక్ష రాశారు. రెండు పరీక్షలకు కలిపి మొత్తం 862 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతారావు, ఏఎస్పీ డేవిస్, పరీక్షల రాష్ట్ర అబ్జర్వర్ తులసీదాస్, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు పరిశీలించారు.
 జిల్లా కేంద్రంలో సందడి..
 టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులతో జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది. హోటళ్లు, లాడ్జీలు కిటకిటలాడాయి. అభ్యర్థులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు సమయానికి బస్సుల్లేక అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధిక ఖర్చు పెట్టి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement