విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.12 కోట్ల భారం | Students parents, the burden of Rs 12 crore | Sakshi
Sakshi News home page

విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.12 కోట్ల భారం

May 18 2016 12:55 AM | Updated on Sep 4 2017 12:18 AM

జిల్లాలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు దాదాపు లక్ష మంది ఉన్నారు. వీరిలో 40 వేలమంది ప్రభుత్వ పాఠశాలల్లో

కోదాడ : జిల్లాలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు దాదాపు లక్ష మంది ఉన్నారు. వీరిలో 40 వేలమంది ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుతుండగా, 60 వేల మంది వరకు ప్రై వేట్‌పాఠశాలలో ఆం గ్ల మాధ్యమంలో చదువుతున్నారు.  6 నుంచి 10 తరగతుల వరకు ఆంగ్లమాధ్యమం పుస్తకాలు అందుబాటులోకి రావడంతో తప్పనిసరిగా వాటినే ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్టేట్ సిల బస్‌లో నడుస్తున్న ప్రభుత్వ, ప్రై వేట్ పాఠశాలన్నింటిలో ఈ  ప్రభుత్వ పుస్తకాలనే వాడుతున్నారు. కానీ ప్రాథమికస్థాయిలో ఆంగ్లమాధ్యమంలో ప్రభు త్వ పుస్తకాలు ఇప్పటి వరకు లేవు. దీంతో 1నుంచి 5 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వివిధ రకాల ప్రైవేట్ పబ్లిషర్స్ నుంచి పుస్తకాలు కొని విద్యార్థులకు ఇస్తున్నాయి. కానీ 2016-17లో ప్రాథమికస్థాయి విద్యార్థులకు ఆంగ్లమాధ్యమం పుస్తకాలు రాబోతున్నాయి. దీంతో తమ వ్యాపారం కోసం ప్రైవేట్ విద్యాసంస్థలు హడావుడిగా పుస్తకాలను అంటగడుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై రూ.12 కోట్ల భారంపడుతోంది.
 
 చేతివాటం ప్రదర్శిస్తున్న పాఠశాలలు..
 విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేయడంలో కూడా ప్రైవేట్ పాఠశాలలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ పబ్లిషర్స్ ప్రమాణిక పుస్తకాలను ముద్రిస్తున్నాయి. కానీ అవి తమ రేట్లపై 2 నుంచి 3 శాతం మాత్రమే కమీషన్ ఇస్తాయి. దీంతో పాఠశాలల నిర్వాహకులు వీటిని తమ విద్యార్థులకు ఇవ్వరు. కొన్ని సాధారణ పబ్లిషర్స్ పుస్తకాల ధరపై 25 నుంచి 30 శాతం వరకు కమీషన్ ఇస్తారు. ఇవి ప్రామాణికంగా లేక పోయినా తమకు ఎక్కువ లాభం వస్తుండడంతో వీటినే తీసుకొని పుస్తకాల మీద ఉన్న ధరకు తల్లిదండ్రులకు అంటగడుతున్నారు. వీటితో పాటు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్లు, బ్యాగులు, సాక్సులు, చివరకు లంచ్‌బాక్సులు, వాటర్‌బాటిళ్లు కూడా వారే సరఫరా చేస్తున్నారు. వీటికోసం ఒక్కో విద్యార్థి నుంచి  ఐదారువేల రూపాయలను వసూలు చేస్తున్నాయి.
 
 మరీ ఈ సంవత్సరం పరిస్థితి ఏమిటి?
 2016-17 విద్యాసంవత్సరంలో ప్రాథమిక తరగతులకు కూడా ఆంగ్లమాధ్యమంలో ప్రభుత్వ పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వం కూడా వాటినే అందరు ఉపయోగించాలని ప్రకటించింది. వాటిధరలు కూడ తక్కువగా ఉంటాయి. ఒక్కోతరగతికి 100 నుంచి 200 రూపాయలలోపే ఉన్నట్లు సమాచారం. తప్పని సరిగా వాటినే వాడాలనే ఆదేశాలను అమలు చేస్తే తల్లిదండ్రుల మీదపడే కోట్లాదిరూపాయల భారం తగ్గుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే సంబంధిత అధికారుల ద్వారాప్రకటించడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
 
 ప్రభుత్వ పుస్తకాలనే వాడాలి : గోపతి గోపయ్య, ఎంఈఓ
 ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రాథమిక తరగతులకు ప్రభుత్వ పుస్తకాలనే వాడాలి. ప్రైవేట్ పుస్తకాలను వాడితే చర్యలు తప్పవు. ప్రైవేట్ పాఠశాలలు అంటగితే చర్యలు తీసుకుంటాము.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement