డెంగీ తో చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మృతి చెందాడు.
కొండపాక: డెంగీ తో చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం మెదక్ జిల్లా కొండపాక మండలం మంగోలు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మీస విష్ణు(14) పదోతరగతి చదువుతున్నాడు. కాగా, వారం క్రితం జ్వరం రావడంతో సిద్ధిపేటలోని వైద్యం చేయించుకున్నాడు. అయినప్పటికి జ్వరం తగ్గక పోవడంతో హైదరాబాద్ కు తరలించారు. వైద్యులు డెంగీ సోకిందని నిర్ధారించారు. కాగా, చికిత్స పొందుతూ శనివారం విష్ణు మృతి చెందాడు.