రైల్లోంచి జారి పడి... | Slip on the running train old woman died in khammam district | Sakshi
Sakshi News home page

రైల్లోంచి జారి పడి...

Dec 9 2015 2:14 PM | Updated on Sep 3 2017 1:44 PM

ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారి పడి మృతిచెందింది. ఈ ఘటన కారేపల్లి సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారి పడి మృతిచెందింది. ఈ ఘటన కారేపల్లి సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.

గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అనసూయ(70) అనే మహిళ రైలులో ప్రయాణిస్తుంది. ఆమె బాత్‌రూం డోర్ అనుకొని బయటి గేటు ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా జారి బయటకు పడింది. దీంతో అనసూయ అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement