24 రోజుల తర్వాత తెరుచుకోనున్న విద్యాసంస్థలు  | Schools Are Reopen In Telangana After 24 Days | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బడులు

Oct 21 2019 2:13 AM | Updated on Oct 21 2019 8:36 AM

Schools Are Reopen In Telangana After 24 Days - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యా సంస్థలు 24 రోజుల తరువాత ప్రారంభం కాబోతున్నాయి. సోమ వారం నుంచి తరగ తులు నిర్వహించేందు కు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. దసరా సెలవుల్లో భాగంగా గత నెల 28 నుంచి మొదలైన సెలవులు ఈ నెల 13వ తేదీతోనే ముగియాల్సి ఉంది. అయితే ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల వాహనాలన్నీ ప్రజల కోసం నడుపుతున్నారు. దీంతో ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సెలవులను ఈనెల 19 వరకు పొడిగించింది. 20వ తేదీ ఆదివారం కావడంతో సోమవారం పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

నేడు వీడియో కాన్ఫరెన్సు
విద్యాసంస్థలు తెరుచుకోనుండటంతో పరిస్థితిని అంచనా వేసి ఆదేశాలు జారీ చేసేందుకు వీలుగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ సోమవారం ఉదయం 11 గంటలకు  ఆర్టసీ, రవాణా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement