సవితకు పింఛన్ వచ్చింది | savitha got pension with sakshi response | Sakshi
Sakshi News home page

సవితకు పింఛన్ వచ్చింది

Dec 30 2014 2:31 AM | Updated on Oct 17 2018 6:06 PM

సవితకు పింఛన్ వచ్చింది - Sakshi

సవితకు పింఛన్ వచ్చింది

నిజామాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన అంధురాలు ..

నిజామాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న  నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన అంధురాలు సవితకు విలాంగుల కోటాలో ఎట్టకేలకు అధికారులు పింఛన్ మంజూరు చేశారు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.    

ప్రగతినగర్ : నిజామాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన అంధురాలు సవిత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎట్టకేలకు అధికారులు ఆ మెకు పింఛన్ మంజూరు చేశారు. వికలాంగుల కోటాలోసవితకు గతంలో రూ. 500 రూపాయల పింఛన్ వచ్చేది. మూడేళ్ల క్రితం ఆమె సదరం శిబిరా నికి హాజరైంది. సదరం నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పుట్టు గుడ్డి అయిన సవితకు 30 శాతం మాత్రమే అంధత్వం ఉందని ధ్రువీకరించారు.

మరోవైపు సమగ్ర సర్వేలో సిబ్బంది సవితకు బదులుగా ఆమె సోదరి కి అంధత్వం ఉందని నమోదు చేశా రు. దీంతో అధికారులు పింఛన్ నిలిపివేశారు. అప్పటి నుంచి సవిత పడరాని కష్టాలు పడింది. ‘సాక్షి’ ఈ నె ల రెండున ‘సర్వే లోపం..అంధురాలికి శాపం’ అనే శీర్షికతో ఓ పేరిట కథనాన్ని ప్రచురించింది. స్పందించిన కలెక్టర్ ప్రపంచ వికలాంగుల దినోత్స వం రోజున సవితకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ యన ఆదేశం మేరకు కదిలిన అధికారులు తిరిగి సర్వే నిర్వహించి సవిత అంధురాలని నిర్ధారించారు.

అప్పటినుంచి ఎదురు చూస్తున్న సవితకు సో మవారం శుభవార్త చేరింది. ఉదయమే గ్రామ సర్పంచ్ పింఛన్ మంజూరు అయిందని వచ్చి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. సవిత వెంటనే పంచాయతీ కార్యాలయానికి వెళ్లి రెండు నెలల పింఛన్ మూడు వేల రూపాయలు అందుకుంది. ఆనందబాష్పాలు రాల్చుతూ తనకు పిం  ఛన్ రావడానికి కృషి చేసిన ‘సాక్షి’కి, మంజూరు చేసిన కలెక్టర్‌కు కృత జ్ఞతలు తెలిపింది. తనలాంటి వారందరికీ అండగా నిలవాలని విన్నవించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement