
బాన్సువాడ ఆస్పత్రికి రూ.కోటి కేటాయింపు
జిల్లాలోని బాన్సువాడ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కోసం కోటి రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు.
నిజామాబాద్: జిల్లాలోని బాన్సువాడ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కోసం కోటి రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. గురువారం బాన్సువాడ ఏరియా ఆస్పత్రి సమిక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రిని బాన్సువాడకు మార్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.