
సాక్షి, ఖమ్మం : జిల్లాలోని రెడ్స్టార్ బ్లడ్ డోనర్ గ్రూపు సభ్యుడు నరేష్ 25వ సారి రక్తదానం చేశారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో నజీమా అనే మహిళకు అత్యవసరమైన సమయంలో బ్లడ్ డొనేట్ చేశారు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తున్న నరేష్ను పలువురు అభినందించారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు.