రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పదంగా మృతిచెందాడు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పదంగా మృతిచెందాడు. వంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన బీబీనగర్లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఉదయాన్నే తన స్నేహితుని రియల్ఎస్టేట్ కార్యాలయానికి వచ్చిన గొలనుకొండ ప్రవీణ్(25) అక్కడే అనుమానాస్పదంగా మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.