సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించుకుని, తప్పుడు పాసు పుస్తకాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయాలన్నీ వాస్తవమేనని రాష్ట్ర ప్రభు త్వం అంగీకరించింది. వీరిలో టీఆర్ఎస్ నేత తో పాటు పలువురు ఇతరులున్నారని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ హైకోర్టుకు నివేదించారు. ‘‘ఒక్క టీఆర్ఎస్ ఎంపీపీ భర్త గడ్డం భీమా గౌడ్ కుటుంబం స్వాధీనంలోనే 32.11 ఎకరాలుంది. జిల్లాలో మన్నెగూడెం, జోగా పూర్, గొల్లపల్లి, ఘన్పూర్, మైలారం, ఖమ్మంపల్లి, పుప్పాలవానిపేట గ్రామాల్లో మొత్తం 88 కేసుల్లో అనర్హులకు అధికారులు భూములు కట్టబెట్టి, పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసినట్లు తేలింది.
ఈ కేటాయింపులను, పాసు పుస్తకాలను రద్దు చేయాలని జాయింట్ కలెక్టర్కు ఆదేశాలిచ్చాం. తప్పుడు పాసు పుస్తకాల ద్వారా తీసుకున్న రుణాలను వసూలు చేసుకోవాలని బ్యాంకులకు చెప్పాం. నిబంధనలకు విరుద్ధంగా పాసు పుస్తకాలు ఇచ్చిన అప్పటి తహసీల్దార్లు పి.హరి కృష్ణ, జి.వీరన్న, డి.రాజేశ్వర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. కలెక్టర్ నివేదికపై అభ్యంతరాలుంటే పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి స్పష్టంచేస్తూ.. విచారణను కోర్టు వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భీమా గౌడ్కు నోటీసులిచ్చింది.
సాక్షి కథనాల ఆధారంగా పిల్
ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడమే గాక వాటి ద్వారా గ్రామీ ణ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందుతున్న వైనంపై ‘సాక్షి’ ఇటీవల ప్రచురించిన వరుస కథనాలు మంచిర్యాల జిల్లాలో సంచలనం సృష్టించాయి. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ గొల్లపల్లికి చెందిన ఇందూరి రామ్మోహనరావు ‘సాక్షి’ కథనాల ఆధారంగా హైకోర్టులో పిల్ వేశారు. ఈ వైనంపై విస్మయం వ్యక్తం చేసిన ధర్మాసనం.. నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించింది.
‘సాక్షి’ కథనాలు వాస్తవమే
Published Thu, Apr 5 2018 2:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
బాబును చీల్చి చెండాడిన మహిళలు
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..
యధార్థ సంఘటనల ఆధారంగా ‘100 క్రోర్స్’
సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే
పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరు: సీఎం జగన్
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement