ముగిసిన నామినేషన్లు | MLC Nominations end | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్లు

Feb 27 2015 12:05 AM | Updated on Sep 2 2017 9:58 PM

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల మండలి స్థానానికి నామినేషన్లు పర్వం ముగిసింది.

 నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల మండలి స్థానానికి నామినేషన్లు పర్వం ముగిసింది. మూడు జిల్లాల నుంచి వివిధ పార్టీలకు చెందిన 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కొందరు అభ్యర్థులు రెండు, మూడు చొప్పున నామినేషన్లు వేశారు. దీంతో 27 మంది అభ్యర్థులకు గాను 44  సెట్లు దాఖలయ్యాయి.  చివరి రోజైన గురువారం 21 మంది అభ్యర్థులు 28 సెట్లు వేశారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ తరపున తీన్మార్ మల్లన్న, వామపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థి సూరం ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 2వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement