ప్రియురాలిపై కిరోసిన్ పోసి నిప్పటించిన ప్రియుడు | Man assaults lover before setting her on fire in warangal district | Sakshi
Sakshi News home page

ప్రియురాలిపై కిరోసిన్ పోసి నిప్పటించిన ప్రియుడు

May 27 2014 8:30 AM | Updated on Oct 9 2018 5:39 PM

తనను ప్రేమించి మరోకరితో పెళ్లికి సిద్ధమైందన్న విషయం తెలుసుకుని ఓ ప్రియుడు ప్రియురాలిపై ఆగ్రహాంతో ఉగిపోయాడు.

తనను ప్రేమించి మరోకరితో పెళ్లికి సిద్ధమైందన్న విషయం తెలుసుకుని ఓ ప్రియుడు ప్రియురాలిపై ఆగ్రహాంతో ఉగిపోయాడు. అక్కడే ఉన్న కిరోసిన్ క్యాన్ తీసి ఆమెపై పోసి నిప్పంటించాడు. అనంతరం అతడు పరారైయ్యాడు. ఆ ఘటన వరంగల్ జిల్లా మర్రిపెడ మండలం గిరిపురంలో చోటు చేసుకుంది. అయితే ఆ ఘటనలో సదరు యువతికి తీవ్ర గాయాలయ్యాయి. 

 

కుటుంబసభ్యులు బాధితురాలిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement