‘రీషెడ్యూల్‌ రుణాలను మాఫీ చేయాలి’

Kishan Reddy Letter To CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో రీషెడ్యూల్‌ చేసిన పంట రుణాలను మాఫీ చేయాలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు. 2013–14 సంవత్సరానికి రీషెడ్యూల్‌ చేసిన రుణాలను మాఫీ చేయలేదని, వెంటనే దాన్ని చేపట్టాలని పేర్కొన్నారు. గత శాసనసభ సమావేశాల్లో బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తిందన్నారు. మూడు జిల్లాల రైతులకు నష్టం జరిగిన మాట నిజమేనని, వారికి న్యాయం చేస్తామని సీఎం పేర్కొన్నప్పటికీ అమలు కాలేదన్నారు. కరువు కారణంగా పంట రుణాల రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ ఆదేశించిందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top