‘రీషెడ్యూల్‌ రుణాలను మాఫీ చేయాలి’ | Kishan Reddy Letter To CM KCR | Sakshi
Sakshi News home page

‘రీషెడ్యూల్‌ రుణాలను మాఫీ చేయాలి’

Mar 10 2018 3:09 AM | Updated on Oct 1 2018 2:19 PM

Kishan Reddy Letter To CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో రీషెడ్యూల్‌ చేసిన పంట రుణాలను మాఫీ చేయాలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు. 2013–14 సంవత్సరానికి రీషెడ్యూల్‌ చేసిన రుణాలను మాఫీ చేయలేదని, వెంటనే దాన్ని చేపట్టాలని పేర్కొన్నారు. గత శాసనసభ సమావేశాల్లో బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తిందన్నారు. మూడు జిల్లాల రైతులకు నష్టం జరిగిన మాట నిజమేనని, వారికి న్యాయం చేస్తామని సీఎం పేర్కొన్నప్పటికీ అమలు కాలేదన్నారు. కరువు కారణంగా పంట రుణాల రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ ఆదేశించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement