21న జహీరాబాద్‌కు షర్మిల | in this month 21st sharmila tour in zaheerabad | Sakshi
Sakshi News home page

21న జహీరాబాద్‌కు షర్మిల

Apr 17 2014 2:58 AM | Updated on Aug 8 2018 5:33 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 21న జహీరాబాద్‌కు రానున్నారు.

జహీరాబాద్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 21న జహీరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జహీరాబాద్ చేరుకోనున్న షర్మిల, వైఎస్సార్‌సీపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మహ్మద్ మొహియొద్దీన్, జహీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ తరఫున ప్రచారం చేయనున్నారు.

 ప్రచారంలో భాగంగా పట్టణంలో రోడ్డుషో నిర్వహించనున్న ఆమె, ఆ తర్వాత ఏర్పాటు చేయనున్న సభలో ప్రసంగించనున్నట్లు  వైఎస్సార్ సీపీ నేతలు తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement