తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

IAS Officers Transfers In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌ కలెక్టర్‌గా ఉన్న యోగితా రాణాను కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. మరో పది మందిని వివిధ జిల్లాలకు బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వివిధ జిల్లాలకు కొత్తగా నియమితులైన నూతన కలెక్టర్ల వివరాలు
హైదరాబాద్‌- రఘనందన్‌ రావు
రంగారెడ్డి- లోకేశ్‌ కుమార్‌
సిద్ధిపేట- కృష్ణ భాస్కర్‌
కొమురంభీం ఆసిఫాబాద్‌- రాజీవ్‌గాంధీ హనుమంతు
జయశంకర్‌ భూపాలపల్లి- వి. వెంకటేశ్వర్లు
రాజన్న సిరిసిల్ల- వెంకట్రామిరెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం- అమేయకుమార్
సంగారెడ్డి- ఎం హన్మంతరావు
ఖమ్మం- ఆర్‌వీ కర్ణన్‌
వరంగల్‌ అర్బన్‌- ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
యోగితా రాణా- ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top