విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత | Half Kg Gold seized at Shamshabad Airport | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత

Nov 26 2015 6:01 PM | Updated on Sep 26 2018 6:32 PM

శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నగరానికి చెందిన ఓ ప్రయాణికుడి తీరును అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అతడి వద్దనున్న టీవీ స్టాండ్‌లో అమర్చి 500 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement