ఘనంగా సింగరేణి డే వేడుకలు | grand celebration of the singareni day | Sakshi
Sakshi News home page

ఘనంగా సింగరేణి డే వేడుకలు

Dec 24 2014 3:12 AM | Updated on Sep 2 2018 4:18 PM

శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో సింగరేణి డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో సింగరేణి డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరాంపూర్ సీజీఎం సీహెచ్ వెంకటేశ్వర్‌రావు సింగరేణి పతాకం ఎగురవేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు. సాయంత్రం భారీ కేక్ కట్ చేశారు. ఇటీవల నిర్వహించిన వెల్‌బేబీ షో, దీపాలంకరణ పోటీల విజేతలు, ఉత్తమ సేవా కార్యకర్తలు, ఈ నెలలో ఉద్యోగ విరమణ చేయనున్న కార్మికులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా సీజీఎం వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ శ్రీరాంపూర్‌లో ఈ సంవత్సరం ఇప్పటివరకు రూ.223 కోట్ల నష్టం వచ్చిందన్నారు. కార్మికులు, అధికారులు కష్టపడి ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రగతి మైదానంలో సుమారు 20 స్టాళ్లు ఏర్పాటు చేయగా వీటీసీ, వైద్య ఆరోగ్యశాఖ, పర్యావరణశాఖ, రెస్క్యూ, సేవా సమితి స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం ప్రారంభంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటస్వామికి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు బండి రమేశ్, ఎస్‌వోటూ సీజీఎం పీవీ సత్యనారాయణ, ఇన్‌చార్జి డీజీఎం (పర్సనల్)  కిరణ్‌కుమార్, ఏజెంట్లు సురేందర్, జాన్ ఆనంద్, ఏజీఎం ఫణి, డీజీఎం (సివిల్) ప్రసాద్‌రావు, గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శులు నెల్కి మల్లేశ్, లెక్కల విజయ్, పానుగంటి సత్తయ్య, సంజీవ్, పోశెట్టి, నాయకులు సురేందర్‌రెడ్డి, సమ్మిరెడ్డి, సదయ్య, సేవా అధ్యక్షురాలు కళావతి, సీఎంఏవోఐ డివిజన్ అధ్యక్షుడు టి.శ్రీనివాస్ పాల్గొన్నారు.

కాకాకు సంతాపం..
సీజీఎం వెంకటేశ్వర్‌రావు, ఇతర అధికారులు, కార్మికులు కార్యక్రమం ప్రారంభంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటస్వామికి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎస్‌వోటూ సీజీఎం పీవీ సత్యనారాయణ, ఇన్‌చార్జి డీజీఎం (పర్సనల్)  కిరణ్‌కుమార్, ఏజెంట్లు సురేందర్, జాన్ ఆనంద్, ఏజీఎం ఫణి, డీజీఎం (సివిల్) ప్రసాద్‌రావు, గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శులు నెల్కి మల్లేశ్, లెక్కల విజయ్, పానుగంటి సత్తయ్య, సంజీవ్, పోశెట్టి, నాయకులు సురేందర్‌రెడ్డి, సమ్మిరెడ్డి, సదయ్య పాల్గొన్నారు.

జైపూర్ విద్యుత్ ప్రాజెక్టులో..
జైపూర్ : మండల కేంద్రం సమీపంలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టులో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ప్రాజెక్టు ఈడీ సంజయ్‌కుమార్ సూర్ సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయనతోపాటు జీఎం సుధాకర్‌రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కొరత ఉందని, నూతనంగా సింగరేణి సంస్థ నిర్మిస్తున్న 1200మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టుతో రాష్ట్రంలో కొంత కొరత తీరనుందని తెలిపారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పలు సాంస్కృతిక పోటీలు అందరినీ అలరించాయి. అనంతరం విద్యార్థులు, కార్మికులకు బహుమతులు ప్రదానం చేశారు. సివిల్ జీఎం మురళీకృష్ణ, వివిధ శాఖల ఏజీఎంలు, డీజీఎంలు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి ఏరియాలో..
రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి ఆవిర్భావ వేడుకలను గోలేటి టౌన్‌షిప్‌లోని శ్రీ భీమన్న స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏరియా జీఎం రాంనారాయణ సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించారు. 16 రకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా అధికారులు ప్రారంభించారు. ఏజీఎం నిర్మల్‌కుమార్, పీవో సంజీవరెడ్డి, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సదాశివ్, ఎస్‌వోటూ జీఎం వెంకటేశ్వర్‌రావు, డీజీఎం రామకృష్ణ, ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, డీజీఎం పర్సనల్ చిత్తరంజన్‌కుమార్, పర్సనల్ మేనేజర్ సీతారాం, టీబీజీకేస్ ఏరియా మాజీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు ప్రకాశ్‌రావు, ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి, సేవా సభ్యురాళ్లు లక్ష్మి, శంకరమ్మ, డీ వైపీఎం రాజేశ్వర్ పాల్గొన్నారు.  

మందమర్రి ఏరియాలో..
మందమర్రి : మందమర్రి జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం మల్లికార్జునరావు జెండా ఆవిష్కరించారు. స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సేవా సమితి అధ్యక్షురాలు సత్యవతితో కలిసి ప్రారంభించారు. ఏరియాలోని వివిధ డిపార్టుమెంట్‌లలో ఉత్తమ ప్రతిభ చూపిన కార్మికులకు, సేవా సమితి అధ్యర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో సేవలందించిన వారికి జీఎం బహుమతులు అందించారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఏరియా ఎస్‌వోటూ జీఎం దేవికుమార్, డీజీఎం పర్సనల్ ముజాహిద్, ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, యూనియన్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement