కొండపాక: గోదావరి జలాలను త్వరలోనే జిల్లాకు సరఫరా చేసి మెతుకుసీమ వాసులు దశాబ్దాల కల నెరవేరుస్తామని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా మెదక్ జిల్లాలోని చెరువులకు నీరందించనున్నట్లు ఆయన వెల్లడించారు. కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో తపాసుపల్లి రిజర్వాయర్ నుండి నీరు వచ్చే ప్రతిపాదిత కాల్వ స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, సమైక్య పాలకుల కుట్రలతో ఇన్నాళ్లు ఈ ప్రాంతానికి గోదారి నీళ్లు దక్కలేదన్నారు.
స్వరాష్ట్రంలో మన నీళ్లు మనకు దక్కనున్నాయన్నారు. తపాస్పల్లి రిజర్వాయర్ నుండి కొండపాక మండలంలోని 11 గ్రామాల పరిధిలోని 16 చెరువులకు నీరందించడానికి పనులు ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా మండల పరిధిలోని గ్రామాలకు సుజలస్రవంతి పథకం ద్వారా గోదావరి జలాలు అందించడానికి ప్రతిపాదించామని తెలిపారు. గజ్వేల్కు తాగునీటి కోసం సీఎం కేసీఆర్ రూ. 30 కోట్లు మంజూరు చేశారనీ, అయితే స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు ఈ పథకాన్ని కొండపాక వరకూ విస్తరించడానికి ఇంజనీరింగ్ అధికారులతో సర్వే పనులు జరిపిస్తున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు, డీసీసీబీ వైస్చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, గజ్వేల్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ భూంరెడ్డి, ఎంపీపీ అనంతుల పద్మ, జెడ్పీటీసీ సభ్యురాలు చిట్టి మాధురి, సర్పంచ్ పసుల సరిత, నేతలు సాయిబాబా, నరేందర్, పోల్కంపల్లి యాదగిరి పాల్గొన్నారు.
రిజర్వాయర్ను సందర్శించిన మంత్రులు
వెలికట్ట గ్రామ శివారులో రాజీవ్హ్రదారి పక్కన నిర్మించిన సుజలస్రవంతి పథకం క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్లు ప్రారంభించారు. సుజల స్రవంతి గోదావరి నీటి రిజర్వాయర్, పంపుహౌస్లను వారు మంత్రి తన్నీరు హరీష్రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్లతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ, డాక్టర్ మౌలానా అబుల్కలాం ఆజాద్ సుజల స్రవంతి పథకం ద్వారా హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపు 2015 జూన్ మాసంలో ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో ఐజీ అనురాగ్శర్మ, జిల్లా ఎస్పీ శెముషీ బాజ్పాయ్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘గోదావరి’తో గొంతు తడుపుతాం
Published Sun, Nov 16 2014 11:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
Advertisement