ఖమ్మంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Gandhi Jayanti Celebrations Going On In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఖమ్మం గాంధీ చౌక్‌లో జరిగిన ఈ వేడుకల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, ఎంపీ నామా నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ముగ్గురు మంత్రులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఖమ్మంలోని తెరాస నేత వద్దిరాజు రవిచంద్ర నివాసంలో తేనీటి విందులో మంత్రులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top