సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయ భవన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది! విశ్వసనీయ వర్గాల సమా చారం ప్రకారం ఈ నెల 27న కొత్త సచివాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భూమి పూజ చేయనున్నారు. ఈ నెల 27 తర్వాత నుంచి మూడు నెలల వరకు సుముహూర్తాలేవీ లేకపోవడంతో 27వ తేదీనే ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. ప్రస్తుతం తెలంగాణ సచివాలయ కార్యాలయాలు కలిగిన ఏ, బీ, సీ, డీ బ్లాకుల భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులను ప్రారంభించడానికి వీలుగా ఏపీ ప్రభుత్వ అధీనంలోని సచివాలయ భవనాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీ అధీనంలో ఉన్న సచివాలయం, అసెంబ్లీ భవనాలతోపాటు ఎమ్మెల్యే క్వార్టర్స్ను తమకు అప్పగించాలని ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర విభజన అనంతరం సచివాలయంలోని ఏ, బీ, సీ, డీ బ్లాకులను తెలంగాణకు, ఎల్, జే, హెచ్, కే బ్లాకులను ఏపీకి కేటాయించారు. ఏపీ అధీనంలోని బ్లాకుల అప్పగింత పూర్తయిన వెంటనే తెలంగాణ సచివాలయంలోని వివిధ శాఖల కార్యాలయాలను ఈ భవనాలకు తరలించి ఏ, బీ, సీ, డీ బ్లాకులను ఖాళీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఖాళీ చేసిన ఏ, బీ, సీ, డీ బ్లాకుల భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా ఏపీ భవనాల అప్పగింత ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది.
సత్వరమే భవనాలు అప్పగించండి: సీఎస్
హైదరాబాద్లో ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను సత్వరమే తమ రాష్ట్రానికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి కోరారు. ప్రధానంగా సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలను వీలైనంత త్వరగా అప్పగించాలని ఆయన పేర్కొన్నారు. ఏపీ అధీనంలో ఉన్న భవనాల అప్పగింత అంశంపై సోమవారం ఆయన సచివాలయంలో ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (ఎక్స్ అఫీషియో) ఎల్. ప్రేమ్చంద్రారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావులతో సమావేశమై చర్చించారు. హైదరాబాద్లో ఏపీ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కోసం కేటాయించిన భవనాలు నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉన్న నేపథ్యంలో వాటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ నెల 2న ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే.
ఈ క్రమంలో భవనాల అప్పగింత ప్రక్రియ వేగిరం చేయాలని సీఎస్ ఎస్కే జోషి ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా సమావేశానికి హాజరైన ప్రేమ్చంద్రారెడ్డిని కోరారు. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఏపీ అధీనంలో ఉన్న భవనాలను తమకు అప్పగిస్తే కొత్త భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకుంటామని సీఎస్ పేర్కొన్నట్లు తెలిసింది. ఏపీ సచివాలయ భవనాలను తెలంగాణ సాధారణ పరిపాలన శాఖకు, ఏపీ అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి, ఎమ్మెల్యే క్వార్టర్లను ఎస్టేట్ ఆఫీసర్కు అప్పగించాలని సీఎస్ సూచించారు.
భవనాల అప్పగింత అంశాన్ని తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం దృష్టికి తీసుకెళ్తామని, తమ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని ప్రేమ్చంద్రారెడ్డి తెలంగాణ సీఎస్కు తెలిపారు. సచివాలయంలోని జే బ్లాక్ భవన సముదాయం నుంచి ఫైళ్లు, ఇతర సామగ్రిని సోమవారం ఏపీ అధికారులు రెండు వాహనాల్లో నింపి తమ రాష్ట్రానికి తరలించారు. దీనిపై ‘సాక్షి’ప్రేమ్చంద్రారెడ్డిని సంప్రదించగా ఏపీకి కేటాయించిన భవనాలను ఖాళీ చేసి తెలంగాణకు అప్పగించాలని తనకు ఇప్పటివరకు ఎలాంటి సూచనలు అందలేదన్నారు. ఏపీ ప్రభుత్వశాఖలు తమ ఫైళ్లను స్వరాష్ట్రానికి తరలించుకోవడం కొత్త విషయం కాదన్నారు.
కొత్త సచివాలయానికి 27న శంకుస్థాపన!
Published Tue, Jun 11 2019 3:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement