డ్రైవర్ మృతితో బంధువుల ఆందోళన | driver dead relatives protesting at rice mill | Sakshi
Sakshi News home page

డ్రైవర్ మృతితో బంధువుల ఆందోళన

Nov 18 2015 6:57 PM | Updated on Sep 29 2018 5:26 PM

ఓ రైస్ మిల్లు డ్రైవర్ మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.

వేములపల్లి: ఓ రైస్ మిల్లు డ్రైవర్ మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. వేములపల్లి మండలం కనకమహాలక్ష్మి రైస్‌మిల్లులో దూదిమెట్ల సైదులు(28)  రైస్‌మిల్లులో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో బుధవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వైద్యులు గుండెపోటుతో మృతిచెందాడని చెప్పారు. దీంతో అతని బంధువులు మృతదేహంతో రైస్‌మిల్లు ఎదుట ఆందోళనకు దిగి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement