డ్రైవర్ మృతితో బంధువుల ఆందోళన | driver dead relatives protesting at rice mill | Sakshi
Sakshi News home page

డ్రైవర్ మృతితో బంధువుల ఆందోళన

Nov 18 2015 6:57 PM | Updated on Sep 29 2018 5:26 PM

ఓ రైస్ మిల్లు డ్రైవర్ మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.

వేములపల్లి: ఓ రైస్ మిల్లు డ్రైవర్ మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. వేములపల్లి మండలం కనకమహాలక్ష్మి రైస్‌మిల్లులో దూదిమెట్ల సైదులు(28)  రైస్‌మిల్లులో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో బుధవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వైద్యులు గుండెపోటుతో మృతిచెందాడని చెప్పారు. దీంతో అతని బంధువులు మృతదేహంతో రైస్‌మిల్లు ఎదుట ఆందోళనకు దిగి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement