విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని మృతి | Degree student dies of Fever | Sakshi
Sakshi News home page

విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని మృతి

Aug 27 2015 5:05 PM | Updated on Aug 17 2018 2:53 PM

విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని మృతిచెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా వేమునపల్లి మండలం నిల్వాల్ గ్రామంలో గురువారం జరిగింది.

వేమునపల్లి (ఆదిలాబాద్) : విషజ్వరంతో డిగ్రీ విద్యార్థిని మృతిచెందింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా వేమునపల్లి మండలం నిల్వాల్ గ్రామంలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. నిల్వాల్ గ్రామానికి చెందిన ఎస్. శిల్ప(20) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది.

ఈ క్రమంలో గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇది గుర్తించిన తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement