మహబూబ్నగర్: వడ్డీ ఎంతయినా పర్వాలేదు.. నెలనెలా నిక్కచ్చిగా ఇస్తానన్నాడు. కొంతకాలం అలాగే చేశాడు. ఇంకేముంది అధిక వడ్డీ వస్తుంది కదా అని అతడికి వడ్డీకిచ్చిన వ్యక్తులు తమ బంధువులు, స్నేహితుల నుంచి కూడా అప్పులు ఇప్పించారు. తీరా రూ.12 కోట్ల దాకా పోగేసుకున్న ఓ వ్యక్తి అదను చూసి పరారయ్యాడు. దీంతో బాధితులు బోరుమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్లో నివాసం ఉండే రమేష్ నాలుగేళ్ల క్రితం మహబూబ్నగర్లో మేధ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశాడు.
దీంతో పాటు అతను షేర్ మార్కెట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఇందులో పెట్టుబడి పెట్టటానికి పట్టణంలోని ప్రముఖ వ్యాపారుల యువకులను నమ్మించి లక్షల్లో తీసుకున్న డబ్బులకు నెలసరి వడ్డీలు చెల్లిస్తూ వచ్చాడు. వచ్చిన లాభాల్లో కూడా పర్సంటేజీలు ఇస్తానని మరింత ఆశ పెట్టాడు. తెలిసిన వారితో పాటు ఉద్యోగులను, వారి బంధువులను కూడా ఈ ఉచ్చులోకి లాగాడు. ప్రారంభంలో వందకు రూ.5 వడ్డీ చెల్లించాడు. ఈ విషయం ప్రచారం కావడంతో చాలామంది లక్షల రూపాయలు అతనికి ఇచ్చారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి అతనికి రూ.2 కోట్లు ఇచ్చినట్లు సమాచారం.
కొన్ని నెలలైన తరువాత అప్పులు ఇచ్చిన వారితో మరో ఒప్పందం చేసుకున్నాడు. వందకు రూ.10 వడ్డీ ఇస్తానని ఎవరి వద్దయినా తీసుకు రావచ్చన్నాడు. దీంతో చాలామంది బయట అప్పులు తెచ్చి రమేష్కు వడ్డీకి ఇచ్చారు. ఇలా జిల్లాలో రూ.12కోట్ల వరకు తీసుకున్నాడు. కొంతకాలం నుంచి అతడు వడ్డీ చెల్లించక పోవడంతో అతడిని నిలదీశారు. దీంతో కొంతమందికి చెక్కులు ఇచ్చాడు. అయినా, డబ్బులు ఇవ్వలేదు. పైగా మహబూబ్నగర్లో ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్కు వెళ్లాడు. దీంతో బాధితులు అతడిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. శుక్రవారం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అధిక వడ్డీ ఆశచూపి..రూ.12 కోట్లతో పరారీ
Published Fri, Aug 7 2015 9:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నగదు సీజ్
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement