వరంగల్ లో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం | Couple attempts Suicide | Sakshi
Sakshi News home page

వరంగల్ లో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

May 14 2015 8:49 PM | Updated on Jul 10 2019 7:55 PM

కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం చోటుచేసుకుంది.

వరంగల్ : కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్లోని వల్లభనగర్‌లో నివాసముంటున్న కొమురయ్య(42), పద్మ(38)లు కుటుంబ సమస్యలతో తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి చెందిన ఇద్దరూ  గురువారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement