'తుగ్లక్‌ బాటలో మోదీ, కేసీఆర్‌లు' | Congress leader Randeep Singh Surjewala slams cm kcr | Sakshi
Sakshi News home page

'తుగ్లక్‌ బాటలో మోదీ, కేసీఆర్‌లు'

Sep 9 2017 1:59 PM | Updated on Mar 18 2019 9:02 PM

'తుగ్లక్‌ బాటలో మోదీ, కేసీఆర్‌లు' - Sakshi

'తుగ్లక్‌ బాటలో మోదీ, కేసీఆర్‌లు'

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు తుగ్లక్‌ బాటలో నడుస్తున్నారని.. అందువల్లే అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాల ఆరోపించారు.

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌లు తుగ్లక్‌ బాటలో నడుస్తున్నారని.. అందువల్లే అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాల ఆరోపించారు. నగరానికి వచ్చిన ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మోడీ, కేసీఆర్‌ అన్నదమ్ములుగా తయారయ్యారు. ఇద్దరు అభివృద్ధిని పక్కన పెట్టి సొంత పనులు చక్కదిద్దుకుంటున్నారు.
 
నోట్ల రద్దు వల్ల నల్లధనం ఎంత వెనక్కి వచ్చిందో మోదీ ఇంత వరకు చెప్పలేకపోతున్నారు. హడావిడిగా నోట్లు రద్దు చేయడం వల్ల సామాన్యులు ఎన్ని కష్టాలు పడ్డారో ఆయనకేం తెలుసు? రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారు. ప్రజలను పక్కన పెట్టి వారి కోసం ప్రగతిభవన్‌లు, సచివాలయాలు కట్టుకుంటున్నారు. కేసీఆర్‌ మీద పోరాటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి'  అని పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement